నిన్న ప్రజాదర్బార్.. నేడు మార్నింగ్ వాక్.. మేడమ్‌కు క్రేజ్ మాములుగా లేదుగా

1 year ago 20
నిన్న పాయకరాపేట పేటలో మంత్రి వంగలపూడి అనిత నిర్వహించిన ప్రజాదర్బార్ కు ప్రజలు విపరీతంగా వచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు హోం మత్రి అనిత. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అయితే నేడు అదే పాయకరాపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తీర్చడం కోసం గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు ప్రకటించారు. విలేజ్ వాక్ లో భాగంగా వేంపాడ గ్రామంలో స్థానికులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. వేంపాడలో అడుగడుగునా మహిళలు హారతులు పడుతూ ఆమెకు స్వాగతం పలికారు. గత ఐదేళ్లు విధ్వంసాన్ని చూసిన ప్రజలు.. ఇప్పుడు అభివృద్ధిని చూస్తున్నారన్నారు. వేంపాడ గ్రామంలో కొన్ని చోట్ల డ్రైనేజీ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article