బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలంటూ.. బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు.. బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసును సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే బండి భగీరథ్ ఆచూకీ దొరకలేదని.. నేరం రుజువు అయితే ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని వదిలేది లేదని సిట్ చీఫ్ రితిరాజ్ స్పష్టం చేశారు.