నాగబాబుకు లక్ కలిసి రావటం లేదా?.. మళ్లీ నిరాశేనా!

1 year ago 25
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. బీజేపీ నుంచి ఆర్. క్రిష్ణయ్య అభ్యర్థిత్వాన్ని కమలం పార్టీ ఖరారు చేసింది. ఇక టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లు ఖరారైనట్లు సమాచారం. దీంతో జనసేనకు ఈ సారి అవకాశం లేనట్లు తెలిసింది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును రాజ్యసభకు పంపుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..ఈ పరిణామాలతో మరోసారి నాగబాబుకు నిరాశ తప్పేట్టుగా లేదు. మూడు స్థానాలలో రెండు చోట్ల టీడీపీ, ఒకచోట బీజేపీ పోటీచేయనున్నట్లు తెలిసింది.
Read Entire Article