రైతు భరోసా పథకంపై జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రైతు భరోసా డబ్బులు జమ చేయవద్దంటూ.. అధికారుల చుట్టూ 2 నెలల పాటు తిరిగినట్లు చెప్పారు. తనకు పెన్షన్ వస్తుందని, ఇన్కం ట్యాక్స్ కూడా కడతానని.. అలాంటి తనకు రైతు భరోసా డబ్బులు ఎందుకు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. వారి పట్ల ప్రభుత్వం దయచూపాలని జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి సూచించారు.