గత కొన్ని రోజులుగా తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై తాజాగా బండి సంజయ్.. స్పందించారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎమోషనల్ అయ్యారు. తనను రాజకీయంగా అణిచివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న బండి సంజయ్.. తాను పార్టీకి మచ్చ తీసుకువచ్చేలా ఎప్పుడూ పనిచేయనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేయాలని పిలుపునిచ్చారు.