'నా భర్త సంసారానికి పనికిరాడు విడాకులివ్వండి'... కోర్టుకెక్కిన మహిళ, న్యాయస్థానం సంచలన తీర్పు

1 year ago 16
హైదరాబాద్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ తన భర్తకు నపుంసకత్వం ఉందని అతడితో విడాకులు ఇప్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విడాకులతో పాటుగా రూ.90 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. అయితే, న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విని, భర్త నపుంసకత్వం నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వివాహమైన తర్వాత చాలా ఏళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నావని ప్రశ్నించింది. వైద్య ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలపై విడాకులు ఇవ్వలేమని పిటిషన్‌ను కొట్టివేసింది.
Read Entire Article