తన కుమారుడిపై నమోదైన కేసుపై స్పందించిన బండి సంజయ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడికి సమయం ఇవ్వకపోవడమే తాను చేసిన తప్పు అని పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్న బండి సంజయ్.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తేల్చి చెప్పారు. తనపై కుట్రలు చేస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. తన కుమారుడిని నేరస్థుడిలా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.