హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన కాన్వాయ్ కోసం.. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ను ఆపొద్దంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. తన ఢిల్లీ టూర్ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే స్పెషల్గా ట్రాఫిక్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.