తాను మళ్లీ భారాసలోకి వెళ్తాననేది ముమ్మాటికీ తప్పుడు ప్రచారమేనని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కొత్తగూడెం ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అకౌంట్లోని రూ. 1,400 కోట్లను అమరవీరులకు పంచాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తన మిత్రుడి సంస్థకు అక్రమంగా భవన అనుమతులు ఇచ్చారని, కాళేశ్వరం అవినీతి అనకొండ హరీశ్రావును భారాస ఇంకా ముందుంచుతోందని ఆరోపించారు. మహబూబ్నగర్ ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితులైన 90 మంది రైతులపై పెట్టిన కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని కవిత డిమాండ్ చేశారు.