నన్ను నేను మర్చిపోతా.. తిరుమలలో ఏర్పాట్లను ప్రశంసించిన మీనాక్షి చౌదరి..

5 months ago 25
Heroine Meenakshi Chaudhary about Tirumala: తిరుమలలో టీటీడీ సిబ్బంది ఏర్పాట్లపై సినీ నటి, హీరోయిన్ మీనాక్షిచౌదరి ప్రశంసలు కురిపించారు. మీనాక్షి చౌదరి ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విశేషాలను పంచుకున్న మీనాక్షి చౌదరి.. తిరుమలకు ఎప్పుడు వెళ్లినా తొలిసారిగా వెళ్లిన అనుభూతి కలుగుతోందన్నారు. తిరుమలలో అడుగుపెట్టగానే టెన్షన్, స్ట్రెస్ అన్నీ మాయమవుతాయని.. ప్రశాంతతతో శ్రీవారిని దర్శించుకుంటానని వివరించారు. భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను కూడా ప్రశంసించారు.
Read Entire Article