నట్టింట్లో తల్లి మృతదేహం.. నగల కోసం కుమార్తెల కొట్లాట.. రూ.కోట్లు పంచినా.. ఆఖరికి

9 months ago 16
సూర్యాపేట జిల్లాలో సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే సంఘటన వెలుగు చూసింది. పెంచి, పెద్ద చేసి.. కోట్ల రూపాయల పంచి ఇచ్చిన తల్లికి.. అంత్యక్రియల ఖర్చు భరించడానికి ఆమె బిడ్డలకు మనసు రాలేదు. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ.. నట్టింట్లోనే మూడు రోజుల పాటు కన్నతల్లి మృతదేహాన్ని వదిలేశారు. స్థానికులు వారికి నచ్చజెప్పాలని ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో.. అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తెలు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేసింది.
Read Entire Article