నంద్యాల జిల్లాలో ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోవటం కలకలం రేపింది. నంద్యాల శివారు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో పాప తల్లి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పాప కోసం రెండు వందల మంది పోలీసులు రాత్రి మొత్తం గాలించారు. చివరకు సోమవారం తెల్లవారుజామున సమీపంలోని జొన్నచేనులో పాప నిద్రపోతూ కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు.