సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో రైతు కిడ్నాప్ కలకలం రేపింది. భూ వివాద పరిష్కారం కోసం ముసుగు నారాయణ అనే రైతు ఆర్డీవో ఆఫీసు వద్దకు వచ్చారు. అయితే ఇదే సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి నారాయణను అపహరించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రామగిరి సమీపంలో కారులో వెళ్తున్న వారిని అడ్డగించి రైతును కాపాడారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.