దుర్గ గుడికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకురావొద్దని దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు రావటంతో దేవస్థానం పాలకమండలి సమావేశంలో చర్చించారు. అనంతరం ఉద్యోగులు, హోంగార్డు, సెక్యూరిటీ సహా కొండపై ఎవరూ కూడా సెల్ ఫోన్లు ఉపయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.