కాపు సంఘం నేత దాసరి రాము వైసీపీకి అమ్ముడుపోయారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. గుంటూరు వైసీపీ సీటు కోసం వారికి అమ్ముడుపోయారని ఆరోపించారు. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. 2019లో జనసేన ఓడిపోయిన తర్వాత కొంతమంది కాపు నేతలు పార్టీ విడిచి వెళ్లిపోయారని.. వారిలో దాసరి రాము ఒకరని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారం మాట్లాడితే నాలుక చీరేస్తామంటూ కిరణ్ రాయల్ వార్నింగ్ ఇచ్చారు.