దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

4 months ago 22
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు నమోదుచేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వరకూ 616 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 2500 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసినట్లు తెలిపారు.
Read Entire Article