పాలమూరు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల పంచాయతీ నేపథ్యంలో త్వరలోనే శుభవార్త చెబుతామని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాల పంపకం విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ఇవి త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నీటి పంపకాల విషయంలో త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.