త్వరలోనే రైతులకు రూ.20 వేలు.. అన్నదాత సుఖీభవపై మంత్రి అచ్చెన్నాయుడు

1 year ago 29
ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20 వేలు సాయం అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న అచ్చెన్నాయుడు, ఆలస్యమైనా కూడా సూపర్ సిక్స్ హామీలు అన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇంఛార్జి మంత్రిగా నియమితులు అయిన తర్వాత తొలిసారిగా మన్యం జిల్లాలో పర్యటించారు అచ్చెన్నాయుడు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని.. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే వాటిని చక్కదిద్దినట్లు చెప్పారు,
Read Entire Article