మియాపూర్లో గతేడాది నవంబర్ నుంచి అదృశ్యమైన 52 ఏళ్ల పెంటేష్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. అతడి రెండో భార్య సత్యవతి తన మొదటి పెళ్లిని దాచి పెట్టి మరీ అతడిని పెళ్లాడిందని.. ఆపై తమ అపార్ట్మెంట్లోనే అద్దెకు ఉంటున్న మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుందని గుర్తించారు. వీరిద్దరి విషయం తెలియడంతో.. పెంటేష్ మధుసూదన్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు పంపించగా.. సత్యవతి ఆమె ప్రియుడిని వదిలి ఉండలేక ఈ దారుణానికి పాల్పడినట్లు కనుక్కున్నారు. నిందితులు కూడా తమ నేరాన్ని ఒప్పుకోవడంతో.. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.