తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ ఈఓ.. కీలక వ్యాఖ్యలు

1 year ago 22
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో తిరుమల బుధవారం రాత్రి చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జే శ్యామలరావు స్పందించారు. భద్రత విధుల్లో ఉన్న డీఎస్పీ గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని అన్నారు. పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వారి పరిస్థితిపై అక్కడ వైద్యులను వివరాలు అడిగి ఈఓ తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనలో 41 మంది గాయపడ్డారని చెప్పారు. దీనికి గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు బయటపడతాయని ఆయన చెప్పారు. ప్రాథమిక చికిత్స తర్వాత కొందరు కోలుకోవడంతో వారిని వైద్యులు డిశ్చార్జి చేశారన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వివరించారు. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని, వారికి చికిత్స అందుతోందని చెప్పారు.
Read Entire Article