తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ ప్రతిపాదించిన కాచిగూడ - జగ్గయ్యపేట నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో కీలకమైన లైడార్ సర్వే పూర్తయింది. సుమారు 228 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, అంచనా వ్యయం వంటి వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను జూన్ నెలాఖరుకల్లా సిద్ధం చేసేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2023లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు.. ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన మార్గాన్ని ఖరారు చేస్తూ నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది.