తెలిసీ తెలియకుండా మాట్లాడకు.. వైసీపీ ఎమ్మెల్సీకి లోకేశ్ కౌంటర్

1 year ago 27
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళవారం వాడివాడీ చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా అధికార ఎన్డీయే, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో అంతా కల్పితాలేనని ఆరోపించారు. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐఆర్, పీఆర్సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. నాలుగు లక్షల ఉద్యోగాలని ఎవరు చెప్పారమ్మా అంటూ వరుదు కళ్యాణికి కౌంటర్ ఇచ్చారు. తెలిసీ తెలియకుండా మాట్లాడవద్దని ఆయన సూచించారు.
Read Entire Article