తెలంగాణలో వడదెబ్బతో చనిపోతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 51 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోవడం సంచనలం రేపుతోంది. ఇందులో ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 23 మంది చనిపోవడం గమనార్హం. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వడదెబ్బ మృతుల పరిహారాన్ని కూడా భారీగా పెంచింది.