తెలంగాణలో ఆత్మహత్యల ధోరణిలో పెను మార్పు కనిపిస్తోంది. 2024 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) రిపోర్టు ప్రకారం.. రాష్ట్రంలో రైతులతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మహత్యలు మూడు రెట్లు అధికంగా నమోదయ్యాయి. 2022లో 69గా ఉన్న ఉద్యోగుల ఆత్మహత్యల సంఖ్య 2024 నాటికి 145కి పెరిగింది. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, విద్యా ఒత్తిడి ఈ ఘాతుకాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.