తెలంగాణలో జూలై 15 వరకు రుతుపవనాలు బలహీనపడి బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కరువై.. పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ముఖ్యంగా జూలై 12-15 మధ్య తూర్పు తెలంగాణలో 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు హైదరాబాద్లో 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల తూర్పు, ఈశాన్య భారతం మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షపాత లోటు పెరుగుతోందన్నారు.