హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్లో భాగంగా మహబూబ్నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గుడెబల్లూర్ వరకు 80 కి.మీ. మేర ఎన్హెచ్-167 విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.3,180 కోట్ల అంచనా వ్యయంతో పీఎం గతిశక్తి పథకం కింద చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా మూడు ఎకనమిక్, ఏడు లాజిస్టిక్ నోడ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ రహదారి విస్తరణతో హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు అనుసంధానం ఏర్పడి, పాలమూరు ప్రాంతం పారిశ్రామిక హబ్గా మారనుంది.