తెలంగాణలో భీకర ఎండలు.. వడదెబ్బతో ఒక్కరోజే ఏడుగురు బలి, రానున్న 48 గంటలు మరింత డేంజర్..!

1 year ago 36
తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండటంతో బుధవారం (ఏప్రిల్ 24న) ఏడుగురు వడదెబ్బకు మృతి చెందారు. రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిజామాబాద్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Read Entire Article