తెలంగాణలో నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. రూ. 3,500 కోట్లతో.. గంటన్నరలో గమ్యస్థానానికి.. 150 కి.మీ ఆదా..

10 months ago 14
సూర్యాపేట–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే తెలంగాణ రవాణా రంగానికి కొత్త దిశ చూపుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్మాణాన్ని పరిశీలించి.. ఇది ఉత్తర–దక్షిణ భారతాలను అనుసంధానించే ప్రధాన మార్గమవుతుందని తెలిపారు. ఖమ్మం నుంచి రాజమండ్రి ప్రయాణ సమయం గంటన్నరకి తగ్గి.. విశాఖపట్నం, ఒడిశా దూరం 150 కి.మీ వరకు తగ్గనుంది. దంసలాపురం ఎగ్జిట్‌, మున్నేరు వంతెన, రైల్వే ఫ్లైఓవర్‌ పనులు నవంబర్‌లో పూర్తికానున్నాయి. రూ.3500 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు స్థానిక వ్యాపారం, వ్యవసాయం, వాణిజ్య రవాణాకు ఊపునిస్తూ ఖమ్మం జిల్లాకు గేమ్‌ ఛేంజర్‌గా నిలవనుంది.
Read Entire Article