తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుకు వీలుగా ఇకపై రాష్ట్ర కేబినెట్ సమావేశాలను పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు మంత్రుల కోసం అత్యాధునిక ట్యాబ్లు, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల కీలక సమాచారం లీక్ కాకుండా ఉండటంతో పాటు నిర్ణయాలు త్వరితగతిన రికార్డు అవుతాయి. ఈ-కేబినెట్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.