‘తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం’.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..

4 months ago 14
తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులను పక్కనబెట్టి.. కేవలం రాజకీయ ప్రయోజనాలు మరియు అదృష్ట సంఖ్యల ఆధారంగా మండలాలను, డివిజన్లను ఏర్పాటు చేశారని విమర్శించారు. దీనివల్ల ఒకే నియోజకవర్గం పరిధిలోని మండలాలు వేర్వేరు జిల్లాల్లో కలిసి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమగ్ర పునర్వ్యవస్థీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. అధికారుల నుంచి నివేదికలు తెప్పించి.. శాసనసభలో చర్చించిన తర్వాతే అందరి ఆమోదంతో శాస్త్రీయంగా కొత్త జిల్లాల మార్పులు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Read Entire Article