తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలని భావించిన సభ.. పోలీసులు అనుమతి నిరాకరించడంతో రద్దు అయింది. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. అయితే సభ లేకపోయినా.. మీడియా సమావేశం నిర్వహిస్తానని పేర్కొనడంతో జనసేన కార్యకర్తలతోపాటు రెండు రాష్ట్రాల ప్రజలకు కొంత ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఈ ప్రెస్మీట్లో జనసేనాని ఏం మాట్లాడనున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.