కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా కోస్గి నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు నిర్మించే 300 అడుగుల రోడ్డు ఈ ప్రాంత ప్రగతికి గేమ్ ఛేంజర్ కానుందని చెప్పారు. 225 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్, 430 పడకల ఆసుపత్రి, సాగునీటి ప్రాజెక్టులు, సిమెంట్ పరిశ్రమల ద్వారా కొడంగల్ను విద్యా, వైద్య, పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.