హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ ఎలైన్మెంట్లో నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ సంస్థ కీలక మార్పులు చేసింది. గతంలో సూర్యాపేట, ఖమ్మం మీదుగా ప్రతిపాదించిన రూట్ను మార్చి.. ఇప్పుడు శంషాబాద్ నుంచి భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మీదుగా కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. దీనివల్ల తెలంగాణలో ప్రాజెక్టు దూరం 236 కిలోమీటర్ల నుండి ఏకంగా 123 కిలోమీటర్లకు తగ్గిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తుండగా.. కొత్త రూట్లో సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోంది. సరకు రవాణా, ఎగుమతులకు వీలుగా ఇందులో ప్రత్యేకంగా డ్రైపోర్ట్ స్టేషన్ను ప్రతిపాదించడం విశేషం.