తెలంగాణలో ఆహారకల్తీ, డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం కొత్తగా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనుంది. సీఎస్ సంజయ్జాజు, డీజీపీ సీవీ ఆనంద్ల సమీక్షలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త శాఖకు ఒకే విభాగాధిపతి ఉంటారు. దీని పరిధిలోనే ఎన్ఫోర్స్మెంట్, ఎఫ్ఎస్ఎల్, ప్రాసిక్యూషన్ విభాగాలు పనిచేస్తాయి. కల్తీ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల నుంచి వెనక్కి వచ్చిన సిబ్బందిని ఈ కొత్త విభాగంలోకి పంపించనున్నారు.