తెలంగాణలో ఆ ప్రాంతానికి మహర్దశ.. 20 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకు గ్రీన్‌సిగ్నల్..

6 months ago 41
హుస్నాబాద్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనతో స్థానికుల చిరకాల వాంఛ నెరవేరనుంది. సుమారు 20 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించేందుకు అధికారులు సర్వేకు సిద్ధమవుతున్నారు. పందిళ్ల నుంచి ప్రారంభమై కరీంనగర్, జనగామ రోడ్లను కలుపుతూ ఈ రింగ్ రోడ్డు సాగనుంది. ప్రస్తుతం పట్టణం గుండా వెళ్తున్న జాతీయ రహదారి (NH 765DG) వల్ల ఎదురవుతున్న భారీ వాహనాల రద్దీ.. ట్రాఫిక్ ఇబ్బందులు దీనివల్ల తొలగిపోనున్నాయి. అయితే.. పట్టణ శివార్లలో భూముల ధరలు అధికంగా ఉండటంతో భూసేకరణ ప్రక్రియ ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హుస్నాబాద్ వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందుతుంది.
Read Entire Article