తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రైల్వే ప్రాజెక్టులతోపాటు అన్ని విషయాల్లో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఏకంగా ఎయిర్పోర్టు తరహాలో డెవలప్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు.