తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోన్న పెన్షన్ల పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. సాంకేతిక ఆధారిత లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా దాదాపు లక్ష మందికి పైగా అనర్హులు, కొన్నేళ్ల క్రితమే మరణించిన వారి పేర్లతో అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ దొంగ పెన్షన్లను తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించిన సర్కార్.. ఆ నిధులను వృథా చేయకుండా కొత్తగా 3 లక్షల మంది నిజమైన నిరుపేదలకు, అర్హులకు పెన్షన్లు మంజూరు చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.