Telangana High Court Engineering Posts: తెలంగాణ హైకోర్టు బీటెక్, బీఈ అర్హతతో ఎంపికైన ఏఈలకు నోటీసులు జారీ చేసింది. డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అర్హత లేకుండానే పోస్టులకు ఎంపిక చేయడంపై దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. బీటెక్/బీఈ చదివిన వారిని ఈ పోస్టులకు ఎంపిక చేయడంపై పిటిషన్ దాఖలైంది. 2022 నియామకాల్లో ఎంపికైన 614 మంది తరఫున 65 మందిని ప్రతివాదులుగా చేర్చేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది.