తెలంగాణ వ్యాప్తంగా మే 14 నుండి 21 వరకు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ చేరే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో సైతం 42-44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. మధ్యాహ్నం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, డీహైడ్రేషన్కు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా నీళ్లు, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.