తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు తీవ్రస్థాయికి చేరగా.. అదిలాబాద్ జిల్లా తాంసిలో గరిష్టంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఎండల తీవ్రత 4.7 డిగ్రీల వరకు పెరిగింది. మరోవైపు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.