తెలంగాణ విద్యా విధానం కమిటీ రాష్ట్రంలో 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వార్షిక పరీక్షల వల్ల విద్యార్థులపై పడే ఒత్తిడిని తగ్గించి, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చదువుపై శ్రద్ధ చూపేలా ఈ మార్పు చేయనున్నారు. థియరీ కంటే ప్రాక్టికల్స్కు, అనుభవపూర్వక అభ్యసనానికి ప్రాధాన్యతనిస్తూ, పాఠశాల విద్యలో ఇంటర్ను విలీనం చేసే అంశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తోంది.