రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే తన పదవీకాలం మరో 4 నెలలు ఉండగా.. అది ముగియకుండానే రాజీనామా చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇక విద్యా కమిషన్ ఛైర్మన్గా రేవంత్ సర్కార్కు సమగ్ర రిపోర్ట్ అందించిన ఆకునూరి మురళి.. చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన మార్పులను వివరించారు.