తెలంగాణ రైతులకు తీపి కబురు.. ఇక నేరుగా అకౌంట్లలోకి డబ్బులు

3 months ago 21
వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ (DBT) చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వానాకాలం సీజన్ సన్నద్ధతపై నిర్వహించిన సమీక్షలో.. రైతు వేదికల్లో సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు నిర్ణయించారు. 1.50 కోట్ల ఎకరాల సాగు అంచనాతో 11.50 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Read Entire Article