తెలంగాణ ప్రభుత్వం 22 జిల్లాల్లో రూ.110 కోట్లతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాలను జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించనుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం వీటిని శాశ్వత వేదికలుగా తీర్చిదిద్దారు. ఒక్కో భవనాన్ని 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.5 కోట్లతో నిర్మించారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సమాఖ్యలకు గొప్ప ఊరటనివ్వడమే కాకుండా ఆర్థిక పురోగతికి మార్గం సుగమం చేయనుంది.