తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ఒకేరోజు 3 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో అటవీ శాఖలోనే 3 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో ఈనెలలోనే మరిన్ని నోటిఫికేషన్లను కూడా రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఉద్యోగాలను ఓఎంఆర్లో కాకుండా సీబీటీ విధానంలోనే నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది.