తెలంగాణ ప్రభుత్వం, జర్మనీకి చెందిన థూరింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాస్త్ర సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, జీవ వైజ్ఞానిక రంగాల్లో పరస్పర సహకారం కోసం కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, థూరింగియా మినిస్టర్ ప్రెసిడెంట్ మారియో ఫోకట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో జర్మన్ భాషా శిక్షణ కేంద్రం ఏర్పాటుతో పాటు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా జర్మన్ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులను తీర్చిదిద్దడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.