తెలంగాణ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ

3 months ago 17
తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. మే నెలలో ఎన్నికలు జరిపాలనే లక్ష్యంతో ఓటర్ల జాబితా నవీకరణకు తాజాగా కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్రంలో మొత్తం 566 జడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. న్యాయపరమైన చిక్కులు తొలగడంతో రిజర్వేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందిస్తున్నారు. గడచిన ఐదేళ్లలో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో స్థానాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. త్వరలోనే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది.
Read Entire Article