నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఇద్దరు నేతలూ ఘనంగా స్మరించుకున్నారు. పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన ప్రజా పాలనను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని గుర్తుచేస్తూ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ ప్రజలను కోరారు.