తెలంగాణ ఏర్పాటు కోసం 1200 మంది పౌరులు అమరులైతే.. వారిని గుర్తించేందుకు ఇంకా ఎన్నేళ్లు తీసుకుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణ తనకు స్ఫూర్తినిచ్చిన నేల అని.. తమ గడ్డ కోసం వందల మంది ఆత్మబలిదానాలు చేసుకుంటారా అనిపించిందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ అమరులు అంటే తనకు గౌరవమని.. యువతను బలిచేసి కొందరు నేతలు గద్దెనెక్కారని విమర్శలు గుప్పించారు.