ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం రోజున ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్వాంటం, ఏఐ, టెక్నాలజీ , సెమీ కండక్టర్లు, ఆక్వాకల్చర్ వంటి విషయాలపై చర్చించారు. ఏపీ ఆక్వా, ఉద్యాన ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయాన్ని పరిశీలించాలని సింగపూర్ ప్రధానమంత్రిని చంద్రబాబు కోరారు. అలాగే పలువురు వ్యాపారవేత్తలతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు.